Friday, May 17, 2024

1st Test : ముగిసిన మొదటి రోజు ఆట.. భారత్ స్కోరు 77/1

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 56 పరుగులతో నాటౌట్ గా ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకా పరుగులు స్టార్ట్ చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement