Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 176 క‌రోనా కేసులు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి పెరుగుతున్నా.. మ‌న‌ దేశంలో కరోనా అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement