Monday, April 29, 2024

నిజామాబాద్​లో యువ‌కుడికి 14 కత్తి పోట్లు.. పాత కక్షలతోనే అటాక్‌..

నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలో పాత కక్షలు పురివిప్పాయి. పట్ట పగలు నగరంలో కత్తులు, తల్వార్ లు స్వైర విహారం చేశాయి. ఓ యువకుడికి 14 కత్తిపోట్లు దిగాయి. ఈ ఘటన మంగళవారం మధ్యహ్నం ఐదవటౌన్ పరిధిలోని శాంతి నగర్ లో జరిగింది. నిజామాబాద్ నగరంలోని శాంతి నగర్ లో మంగళవారం మధ్యాహ్నం అన్వర్ అనే యువకుడిపై తల్వార్తో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో అన్వర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అమీర్ అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి అన్వర్ పై తల్వార్ తో దాడిచేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్ తో గతంలో అమీర్ తో గొడవ జరిగింది. 1వ టౌన్ లో కేసు నమోదు కాగా, విత్ డ్రాకు 30 వేల కోసం ఒప్పందం జరిగినట్లు సమాచారం. 20 వేలు చెల్లించిన వ్యక్తి 10 వేల విషయంలో మాట్లాడుదామని పిలిచి గొడవ పడినట్లు తెలిసింది. అయిదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement