Friday, March 29, 2024

అనసూయను మామూలుగా ఆడుకోవడం లేదుగా.. విమెన్స్ డే నాడు వదలని ట్రోలర్స్..

సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ చాలా సార్లు నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురైందనే విషయం తెలిసిందే. అందంతో పాటు అభినయం కలిగిన అనసూయకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పేస్తుంది.. ఎలాంటి జంకు లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ట్రోలర్స్ కి సరైన రీతిలో జవాబు చెప్తుంది. ఈ రోజు అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాక.. తెగ ట్రోల్స్ కి గురవుతుంది.. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ కారణంగా చాలా మంది సెలబ్రెటీలు మహిళల గురించి, వారి జీవితాల్లో విజయానికి అండగా నిలిచిన మహిళల గురించి ప్రస్తావిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

మహిళల త్యాగాలను గుర్తు చేయూసుకుంటూ చాలా మంది పలువురు నెటిజన్లు అనసూయకి విషెష్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తుంది. అనసూయ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. ” ఈ రోజు ఏంటి సడెన్ గా ట్రోలర్స్ & మీమ్స్ మేకర్స్ మహిళలను తెగ గౌరవిస్తున్నారు..? అయిన ఇది కేవలం 24 గంటలు మాత్రమే కదా.. ఆ తరువాత అంత మాములుగా మారిపోతుంది కదా! అందుకే మహిళలు వీటికి దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది.

ఇంకేం ఉంది.. ఈ ట్వీట్ చేసిన కాసేపటికే వైరల్ అవ్వగా.. ట్రోలర్స్ అనసూయపై తెగ విరుచుకపడుతున్నారు. అందరు మొగాళ్లు మీరు ఆలోచించే విధంగా ఉండరు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నీ లాంటి ఆడవాళ్లు మమ్మల్ని మోసం చేసారు కాబట్టే ఇలా తయారయ్యాం అని మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైన అనసూయ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement