Sunday, May 19, 2024

తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు 12గంట‌ల స‌మ‌యం

తిరుమల దేవ‌స్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి సుమారు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామి వారిని 65,187 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.37 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement