Thursday, May 16, 2024

Gujarat: ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 12మంది మృతి

ఉప్పు ఫ్యాక్ట‌రీ గోడ‌కూలి 12 మంది మృతిచెందిన విషాధ ఘ‌ట‌న గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఈరోజు మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్‌ ఏరియా (జీఐడీసీ)లోని సాగర్‌ ఉప్పు కర్మాగారం గోడకూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్‌ మెర్జా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement