Sunday, April 28, 2024

సౌతాఫ్రికా నుంచి భారత్ చేరుకున్న 12 చీతాలు

సౌతాఫ్రికా నుంచి 12 చీతాలు భారత్ చేరుకున్నాయి. మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లోకి మరో 12 చీతాలు రాబోతున్నాయి. దేశంలో అంతరించి పోయిన చీతాల జాతిని పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌతాఫ్రికా నుంచి ఈ చీతాలను తెప్పించింది. సౌతాఫ్రికా నుంచి చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్వాలియర్ లో దిగింది. అక్కడి నుంచి అధికారులు వీటిని హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. ప్రస్తుతం వచ్చిన చీతాలలో ఏడు మగ చీతాలు కాగా, ఐదు ఆడ చీతాలని అధికారులు తెలిపారు. పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ఎన్ క్లోజర్లలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement