Tuesday, May 7, 2024

బస్సులో అగ్నిప్రమాదం.. 11 మంది ప్ర‌యాణికులు మృతి

మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఇవ్వాల (శనివారం) ఉదయం బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెర‌గొచ్చ‌ని అధికారులు అంటున్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement