Thursday, May 9, 2024

100 స్పెషల్ ఆపరేషన్స్.. 182 మంది టెర్రరిస్టుల హతం.. 2021లో జమ్మూ పోలీసుల వీరగాథ..

2021లో జమ్మూ కాశ్మీర్‌లో 100 స్పెషల్ ఆపరేషన్లలో 44 మంది టాప్ ఆర్డర్ తో సహా మొత్తం 182 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది జమ్ము, కాశ్మీర్ ప్రాంతంలో 134 మంది యువకులు తీవ్రవాద శ్రేణుల్లో చేరారన్నారు. వారిలో 72 మందిని న్యూట్రలైజ్ చేశామని, మరో 22 మందిని అరెస్టు చేసినట్టు వివ‌రించారు.

“ఈ ఏడాది చొరబాట్లు త‌గ్గాయి. కేవలం 34 మంది ఉగ్రవాదులు మాత్రమే సరిహద్దులు దాటి వచ్చారు. పాంథా చౌక్‌లో పోలీసు బస్సుపై దాడికి పాల్పడిన జెఇఎమ్‌కి చెందిన 9 మంది ఉగ్రవాదులతో పాటు అందరినీ 24 గంటల్లో హతమార్చాం” అని పేర్కొన్నారు దిల్ బాగ్ సింగ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement