Saturday, April 27, 2024

Pavagada: ప్రైవేట్ బస్సు బోల్తా.. 10 మంది దుర్మరణం

కర్ణాటకలోని తుముకూరు జిల్లా పావుగడ సమీపంలో చెరువు కట్టపై ఒక ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో సుమారు పది మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడినవారిని పాగోడా తుముకూరు ప్రభుత్వ ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. బస్సు బోల్తా పడిన సమయంలో ప్రయాణికులతో  కిక్కిరిసి ఉంది. సుమారు 60 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెరువు కట్టమీద మలుపులో డ్రైవర్ బస్సును నియంత్రించకపోవడంతో అడ్డంగా పడిపోయింది. దీంతో చాలా మంది మృత్యువాత పడ్డారు. పలువురు క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలానికి కర్ణాటక మంత్రులు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పావగడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement