Sunday, April 28, 2024

మహిళా దినోత్సవాన్ని వెరైటీగా జరుపుకున్న ఎమ్మెల్యే

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జార్ఖండ్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే వెరైటీగా జరుపుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్​ రాంచీలోని శాసనసభకు గుర్రంపై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ కర్నల్ రవి రాథోడ్ ఈ గుర్రాన్ని కానుకగా ఇచ్చారని ఆమె తెలిపారు. అంబా ప్రసాద్ 2019లో జార్ఖండ్‌లోని బార్కాగావ్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 31 ఏళ్ల వయసులోనే MLA అయిన ఆమె.. ఆ రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement