Thursday, May 2, 2024

మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు…

గ‌త కొద్ది కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న పుత్త‌డి ధ‌ర‌లు ఈరోజు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.330 పెరిగింది. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం వివిధ న‌గ‌రాల్లో పెత్త‌డి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,330గా ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.44,300గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,300గా ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర 44,300గా ఉన్న‌ది. అటు విజ‌య‌వాడ‌లోనూ ఇవే ధ‌ర‌లు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,670గా ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.46,450గా ఉన్న‌ది. బంగారంతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర రూ.300 పెరిగి రూ.67,700కి చేరింది. దీంతో బంగారం కొనాల్సిన మహిళలు అప్రమత్తమవుతున్నారు. రేట్లు ఇంక పెరగకముందే కావల్సిన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: IPl: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఇక పండగే

Advertisement

తాజా వార్తలు

Advertisement