Friday, May 3, 2024

నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం..

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సోమవారం శ్రీరాముడి మహాపట్టాభిషేకం జరుగనున్నది. ఆలయ అర్చకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేడుక నిర్వహించనున్నారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ తమిళిసై హాజరుకానున్నారు. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.

కాగా, నిన్న సీతారాముల కల్యాణాన్ని భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో భక్తుల సమక్షంలోనే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తెలుగురాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. జగదభిరాముడు, సీతమ్మవారి కల్యాణాన్ని చూసిన భక్తజనం తన్మయత్వం చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement