Tuesday, April 30, 2024

‘నాకు జాబ్ రాలేదని తాజ్‌మహల్‌లో బాంబు పెట్టా’

ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో తాజ్‌మహల్ ఒకటి. గురువారం ఈ చారిత్ర కట్టడానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. ‘సైనిక నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. నన్ను రిక్రూట్ చేసుకోలేదు. అందుకే తాజ్‌మహల్‌లో బాంబు పెట్టాను. త్వరలోనే అది పేలుతుంది’ అని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులను అక్కడి నుంచి ఖాళీ చేయించి తాజామహల్‌ను మూసివేశారు. బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి ఈ కాల్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేవలం బెదిరించడం కోసమే అతడు తాజ్‌మహల్‌లో బాంబు పెట్టినట్లు చెప్పాడని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement