Friday, May 3, 2024

చెత్తకుప్పలో ఆడశిశువు మృతదేహం

ఎన్ని చెప్పినా ఆడిపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మైలార్ దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మధుబన్ శివారు జల్‌పల్లి మార్గంలోని ఓ చెరువు ఒడ్డున చెత్తకుప్పలో ఆడశిశువు మృతదేహం దొరకడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును చెత్తకుప్పలో వేసి చేతులు దులుపుకోవడంతో.. ఆ శిశువుపై వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో ఆఢశిశువు ప్రాణం కోల్పోయింది. చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా అబార్షన్ చేసి శిశువును బయట పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement