Saturday, April 27, 2024

ఓ కేసులో తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు

మరోసారి సుప్రీంకోర్టు తీర్పు వార్తల్లో నిలిచింది. అత్తారింట్లో కుటుంబ స‌భ్యులు, బంధువులు కొట్ట‌డం వ‌ల్ల భార్య‌కు గాయాలైనా దానికి భ‌ర్త‌దే బాధ్య‌త అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పంజాబ్‌కు చెందిన ఓ వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది. త‌న భార్యకు త‌గిలిన గాయాల‌కు తాను కార‌ణం కాద‌ని, త‌న తండ్రి వ‌ల్లే అలా జ‌రిగింద‌ని, త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆ వ్య‌క్తి సుప్రీంను ఆశ్ర‌యించాడు. అయితే కోర్టు మాత్రం అత‌డి వాద‌న‌ను తోసిపుచ్చింది. అత్తారింట్లో త‌న బంధువుల వ‌ల్ల భార్య‌కు గాయాలు త‌గిలినా కూడా అందుకు ప్ర‌ధాన‌ బాధ్య‌త మాత్రం భ‌ర్త‌దే అని న్యాయ‌స్థానం స్పష్టం చేయడంతో పాటు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కొట్టేసింది.

కాగా సదరు భర్తపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నువ్వేం మ‌నిషివి? త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని నీ భార్య చెబుతోంది. మీరు కొట్ట‌డం వ‌ల్ల తన‌కు గ‌ర్భ‌స్రావం అయింద‌ని చెప్పింది. భార్య‌ను క్రికెట్ బ్యాట్‌తో కొడ‌తావా? నువ్వేం మ‌నిషివి?’ అని న్యాయమూర్తి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement