Thursday, May 2, 2024

ఏపీలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లాం: బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురంలో మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇసుక, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఏపీలో అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని గుర్తుచేశారు. జవాబుదారీతనం ఉన్న పార్టీకి ప్రజలు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో వైసీపీ నేతలు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువత భవిష్యత్ అంధకారంలో మునిగిపోయిందన్నారు. అటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయామని విమర్శించారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని.. ఒకరు చంద్రబాబును తిట్టడానికి, మరొకరు లిక్కర్ మాఫియాకి ఉన్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement