Tuesday, May 7, 2024

టి20 సిరీస్‌ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా..

నిర్ణయాత్మక ఐదో టీ 20 మ్యాచ్ లో విండీస్ పై సౌతాఫ్రికా విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను 3–2తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్వింటన్‌ డికాక్‌ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. ఎవిన్‌ లూయిస్‌ (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇన్‌గిడి 3 వికెట్లు తీయగా… రబడ, వియాన్‌ ముల్దర్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మార్క్‌రమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును దక్కించుకోగా… ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా షమ్సీ నిలిచాడు.

ఇది కూడా చదవండి: కార్లోస్ బ్రాత్‌వైట్ కు కరోనా పాజిటివ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement