Thursday, May 2, 2024

లండన్ రెస్టారెంట్‌లో విరుష్క లంచ్..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లార్డ్స్ టెస్ట్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. లార్డ్స్ టెస్ట్ ఘనవిజయం అనంతరం వీరిద్దరు లండ‌న్‌లో ఉన్న టెండ్రిల్ రెస్టారెంట్‌లో అనుష్కాతో క‌లిసి శాఖాహార భోజ‌నం చేశాడు. అయితే ఆ రెస్టారెంట్ త‌న ఇన్‌స్టాలో చెఫ్‌తో క‌లిసి దిగిన విరుష్కా జంట ఫోటోను పోస్టు చేసింది. బ‌హుశా మీరు లంచ్ ఎంజాయ్ చేసి ఉంటార‌ని ఆ రెస్టారెంట్ త‌న ట్యాగ్‌లో పేర్కొన్న‌ది. విరాట్ కోహ్లీ, అనుష్కాలు ఇద్ద‌రూ వెగ‌న్ ల‌వ‌ర్స్‌. శాఖాహార ఫుడ్‌ను వాళ్లు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. లండ‌న్‌లో రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ ఇద్ద‌రూ మాస్క్‌లు ధ‌రించారు. రెస్టారెంట్ చెఫ్ రిషిమ్ కూడా ఆ ఫోటోలో ఉన్నాడు. విరుష్కా జంట ఆ రెస్టాంట్ సిబ్బందితో దిగిన మ‌రో ఫోటోను కూడా షేర్ చేసింది.

ఇది కూడా చదవండి: ఈ-కేవైసీ లేకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుందా? ఈ-కేవైసీ వల్ల ప్రయోజనాలేమిటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement