Sunday, May 5, 2024

అంపైర్స్ కాల్‌ కొనసాగుతుంది: ఐసీసీ

క్రికెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంపైర్ కాల్ విధానాన్ని కొనసాగిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. డీఆర్ఎస్ విధానంలో భాగంగా క్రికెట్​లో ‘అంపైర్స్ కాల్’​ నిబంధన ఉంటుందని తెలిపింది. ఈ విధానంపై ఇటీవల వస్తున్న విమర్శలపై ఐసీసీ స్పందించింది. బాల్ ట్రాకింగ్ విధానం 100 శాతం సరైందేం కాదని.. అందుకే క్రికెట్​లో ‘అంపైర్స్ కాల్’​ నిబంధన కొనసాగుతుందని తెలిపింది. ఐసీసీ పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చించనుంది. కాగా ఇటీవల భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ సందర్భంగా పలు క్యాచ్‌లు నేలకు తాకినా అంపైర్స్ కాల్ సందర్భంగా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement