Wednesday, April 24, 2024

గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన ఢిల్లీ సారథి

తొలి వన్డేలో గెలిచి ఊపు మీద ఉన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌లో రాణించిన శ్రేయాస్ అయ్యర్ గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం నాడు జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ తదుపరి వన్డేలకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది. భుజానికి బలంగా దెబ్బ తగలగా, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయ్యర్ భుజానికి సర్జరీ చేయాల్సి ఉందని బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో ఇంగ్లండ్‌తో రెండు వన్డేలకు మాత్రమే కాకుండా ఐపీఎల్ సీజన్ మొత్తానికి శ్రేయాస్ అయ్యర్ దూరం కానున్నాడు. దీంతో అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఇంగ్లండ్ జట్టును కూడా గాయాల బెడద వేధిస్తోంది. తొలి వన్డేలో ఫీల్డింగ్ సందర్భంగా ఇయాన్ మోర్గాన్, శామ్ బిల్లింగ్స్ గాయపడ్డారు. దీంతో వారు రెండో వన్డేకు దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement