Monday, May 6, 2024

Breaking: బంగ్లాతో ట‌ర్న్ అయిన టీ20 మ్యాచ్‌.. ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్న టీమిండియా..

టీ20 వ‌రల్డ్ క‌ప్‌లో భాగంగా ఇవ్వాల జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 184 ప‌రుగులు చేసి, బంగ్లాదేశ్ జ‌ట్టుకు 185 ప‌రుగుల టార్గెట్ పెట్టింది. అయితే.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభం అయిన 7 ఓవ‌ర్ల త‌ర్వాత వ‌ర్షం రావ‌డంతో ఆట‌కు అంత‌రాయం క‌లిగింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయీస్ ప‌ద్ధ‌తిలో ఆట‌ను కుదించారు.

151 ప‌రుగుల టార్గెట్‌ని బంగ్ల‌దేశ్‌కు పెట్ట‌గా.. అప్ప‌టికే మెరుగైన ఆట‌తీరుతో మంచి ర‌న్‌రేట్‌సాధించ‌డంతో 54 బంతుల్లో 85 ప‌రుగుల టార్గెట్ నిర్ధేశించారు. ఇక‌.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా టీమిండియా ఆట‌గాళ్లు వికెట్ల మీద వికెట్లు ప‌డ‌గొడుతూ ఆట‌లో ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం 19 బంతుల్లో 43 ప‌రుగులు చేయాల్సి ఉంది. కాగా, కీల‌క‌మైన ఆరు వికెట్ల‌ను బంగ్లాదేశ్ కోల్పోయిది. ఈ క్ర‌మంలో అర్ష‌దీప్‌సింగ్ 2, హార్దిక్ పాండ్య 2, స‌మీ 1 వికెట్ తీసుకున్నారు. మ‌రొక‌టి ర‌నౌట్‌గా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement