Saturday, May 18, 2024

జైలులో రెండు గ్యాంగ్ స్టర్ గ్రూపుల మధ్య ఘర్షణ.. ఖైదీలతో పాటు పలువురు పోలీసులకు గాయాలు

రెండు గ్యాంగ్ స్టర్స్ గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణను నివారించేందుకు ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఎంత మంది గాయపడ్డారు అన్నది తెలియలేదు. కాగా ఈ ఘటన పంజాబ్ హోషియార్‌పూర్‌ సెంట్రల్ జైలులో చోటు చేసుకుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణపై పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ, ఎస్పీ ర్యాంకు అధికారులు హుటాహుటిన ఆ జైలుకు వెళ్లారు. జైలులో పరిస్థితిని పరిశీలించారు. ఘర్షణలో గాయపడిన ఖైదీలు, పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జైలులో రెండు గ్యాంగ్‌స్టర్‌ గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసిన కారణం ఏమిటన్నది తెలియలేదు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ జైలు వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement