Friday, May 17, 2024

సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో.. ఆత్మహత్యకి పాల్పడిన మహిళ

సీఎం జగన్ అపాయింట్ మెంట్ లభించకపోవడంతో మనస్తాపం చెంది మణికట్టుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఆమెను కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళగా గుర్తించారు. ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆమె చికిత్సకు రూ.2 కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో ఆరుద్ర తల్లడిల్లిపోయింది. తన కుమార్తెను కాపాడాలని సీఎం జగన్ ను వేడుకునేందుకు ఆమె సీఎం కార్యాలయం వద్దకు వచ్చారు. కనీసం లేచి నిలబడలేని కుమార్తెతో సహా అక్కడికి వచ్చిన ఆ మహిళ స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కుమార్తె చికిత్స కోసం అన్నవరంలోని తమ ఇంటిని అమ్ముకోనివ్వకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్ మరో కానిస్టేబుల్ తో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. సీఎం జగన్ ను కలిసే అవకాశం ఇప్పించాలని వారిని ప్రాధేయపడ్డారు. అయితే సీఎం జగన్ అపాయింట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఇక తమకు న్యాయం జరగదని భావించారు. ముఖ్యమంత్రిని కలవాలంటే ముందు ఎమ్మెల్యేలను కలవాలని చెబుతున్నారని, ఇక తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ, ఓ బ్లేడుతో మణికట్టు వద్ద కోసుకున్నారు. ఆమె కింద పడిపోగా, వీల్ చెయిర్ లో ఉన్న ఆమె కుమార్తె పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు. అక్కడివారు ఆ మహిళకు ప్రథమ చికిత్స చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement