Thursday, May 2, 2024

హోలీ వేడుక‌ల్లో టీం ఇండియా ఆట‌గాళ్లు.. వైర‌ల్ గా ఫొటోస్

ఆస్ట్రేలియాలో చివ‌రి టెస్ట్ అహ్మ‌దాబాద్ లో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జ‌ట్లు అహ్మ‌దాబాద్ కి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కు వెళ్లే సమయంలో బస్సులో, ఆ తర్వాత మైదానంలో భారత ఆటగాళ్లు హోలీ జరుపుకున్నారు. రంగులు పూసుకుని ఎంజాయ్ చేశారు. రంగులతో నిండిపోయిన ఆటగాళ్లు నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు నాలుగు మ్యాచ్ ల ఈ టెస్ట్ లో ఇండియా 2-1తో లీడ్ లో ఉంది. చివరి టెస్ట్ ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. హోలీ వేడుకులను టీమిండియా ఆటగాళ్లు ఘనంగా జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement