Friday, May 3, 2024

దుబాయ్‌ బీచ్‌లో టీం ఇండియా.. అలలపై ఎంజాయ్​ చేస్తున్న కుర్రాళ్లు

ఆసియాకప్‌లో వరుస విజయాలతో ముందుకు పోతున్న టీం ఇండియా సూపర్‌ 4కు అర్హత సాధించింది. అయితే సూపర్‌ 4 రౌండ్‌కు ముందు దొరికిన సమయాన్ని టీమ్‌ ఇండియా సభ్యులు ఉల్లాసంగా గడుపుతున్నారు. దుబాయ్‌ బీచ్‌లో జట్టు సభ్యులు సందడి చేశారు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోహ్లీ, చాహల్‌, కెఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌, హర్థిక్‌ పాండ్యా.. జట్టు మొత్తం దుబాయ్‌ బీచ్‌లో సేదతీరింది. కొందరైతే బీచ్‌లో వాలిబాల్‌ ఆడుతూ సరదాగా గడిపారు. ఇక రోహిత్‌ శర్మకు యాకింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేయగా.. విరాట్‌ కోహ్లి టాప్‌లెస్‌లో మెరిశాడు.

ఆసియాకప్‌లో టీమ్‌ ఇండియా అదరగొడుతోంది. గ్రూప్‌ ఏ లో భాగంగా తొలుత చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడగొట్టింది. ఆ తర్వాత హాంకాంగ్‌ను చిత్తు చేసి.. సూపర్‌ 4కు క్వాలిఫై అయింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. అయితే ఇందులో గెలిచిన జట్టు సూపర్‌ 4లో భారత్‌ ఢీ కొడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement