Thursday, April 25, 2024

సచిన్‌ సారథ్యంలో రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌.. ఈ నెల 10న టోర్నమెంట్‌ ఆరంభం

రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ సీజన్‌ -2 టోర్నమెంట్‌లో పాల్గొనే ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టుకు ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన ఆరంభమయ్యే టోర్నమెంట్‌ను డెహ్రాడూన్‌, ఇండోర్‌, రాయ్‌ పూర్‌ , కాన్పూర్‌ వేదికలుగా నిల్వనున్నాయి. ఈ టోర్నీలో తొలిమ్యాచ్‌ కాన్పూర్‌లో జరుగుతుండగా రాయ్‌ పూర్‌లో సెమీ ఫైనల్స్‌ జరుగనున్నాయి. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ జట్లకు చెందిన దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.

న్యూజిలాండ్‌కు లెజెండ్స్‌ జట్టు ఈ సారి కొత్తగా లీగ్‌లో చేరింది. రోడ్డు భధ్రతే ప్రధాన్య లక్ష్యంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు ముందుకు వచ్చి ఇలా సిరీస్‌ ఆడడం వల్ల రోడ్డు భధ్రతపై అభిమానుల్లో అవగాహన వస్తుందని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement