Sunday, April 28, 2024

Captain Surya: ఆస్ట్రేలియా సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాద‌వ్

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు భారత్‌ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్ వ్యవహరించనున్నారు. ఈ నెల 23న విశాఖపట్టణంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. 26న తిరువనంతపురం, 28న గుహవాటి, డిసెంబర్ 1న రాయ్ పూర్, 3న బెంగళూరు వేదికగా మ్యాచ్ లు జరగనున్నాయి.

కాగా ఆస్ట్రేలియాపై యువ ఆటగాళ్ల జట్టు బరిలోకి దించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి బ్యాట్స్‌మెన్‌లకు భారత జట్టులో అవకాశం లభించింది. అయితే, సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా తిరిగి వస్తాడని అంతా భావించినా.. మరోసారి సెలెక్టర్లు హ్యాండ్ ఇచ్చారు. జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా చేరాడు. బౌలింగ్‌లో ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు వచ్చారు.

టీ20 సిరీస్ కోసం ఇరుజట్లు..
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపా.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement