Sunday, May 5, 2024

చెలరేగిపోయిన అప్ఘన్‌ బౌలర్లు.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

ఆసియాకప్‌ 2020లో భాగంగా తొలి మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్‌ , శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అప్ఘనిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా శ్రీలంక తరపున దిల్షన్‌ మదుశంక, మతీషా పతిరన ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగ్రేటం చేయనున్నారు. స్థానిక టి 20 టోర్నీలో పాల్గొని మంచి ఊపులో ఉన్న శ్రీలంక జట్టు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. మరో వైపు ఐర్లాండ్‌తో సిరీస్‌ కోల్పోయిన అప్ఘనిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని రంగంలో దిగింది.
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఫరూఖీ ఆరంభంలోనే గండికొట్టాడు. తొలి ఓవర్‌లో రెండు వికెట్లు ప డిపోయాయి.

శ్రీలంక జట్టు :
దనుష్క గుణ తిలక, పాతుమ్‌ నిస్సాంక, కుసల్‌ మెండిస్‌ ( వికెట్‌ కీపర్‌), చరిత్‌ అసలంక, భానుక రాజపక్స, దసున్‌ షనక ( కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేష్‌ తీక్షణ, దిల్షన్‌ మధుశంక, మతీశ పతిరణ

అఎ్ఘానిస్థాన్‌ జట్టు :

హజ్రతుల్లా బజాయ్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్‌, కరీం జనత్‌, నజీబుల్లా జద్రాన్‌, మహమ్మద్‌ నబీ (కెప్టెన్‌), రషీద్‌ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, ఫజల్హక్‌ ఫరూఖి

Advertisement

తాజా వార్తలు

Advertisement