ఆసియాకప్ 2020లో భాగంగా తొలి మ్యాచ్లో అప్ఘనిస్థాన్ , శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా శ్రీలంక తరపున దిల్షన్ మదుశంక, మతీషా పతిరన ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగ్రేటం చేయనున్నారు. స్థానిక టి 20 టోర్నీలో పాల్గొని మంచి ఊపులో ఉన్న శ్రీలంక జట్టు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. మరో వైపు ఐర్లాండ్తో సిరీస్ కోల్పోయిన అప్ఘనిస్తాన్ ఈ మ్యాచ్లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని రంగంలో దిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఫరూఖీ ఆరంభంలోనే గండికొట్టాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు ప డిపోయాయి.
శ్రీలంక జట్టు :
దనుష్క గుణ తిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ ( వికెట్ కీపర్), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక ( కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేష్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీశ పతిరణ
అఎ్ఘానిస్థాన్ జట్టు :
హజ్రతుల్లా బజాయ్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ (కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖి