Wednesday, May 15, 2024

సాయి సుద‌ర్శ‌న్ అవుట్ – 18 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ 176/ 4

అహ్మాదాబాద్ – కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది..నాలుగో వికెట్ గా సాయి సుద‌ర్శ‌న్ 53 ప‌రుగులు చేసి నరైన్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు . అంత‌కు ముందు అభిన‌వ్ మ‌నోహార్ 14 ప‌రుగులు చేసి స‌యేష్ శ‌ర్మ చేతిలో మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. కాగా, నాలుగో ఓవర్ లో సాహా అవుటైన‌ప్ప‌టికీ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు నిల‌క‌డ‌గా బ్యాటింగ్ కొన‌సాగించారు.. 39 ప‌రుగులు చేసిన శుభ‌మ‌న్ గిల్ ను సునీల్ నారాయ‌ణ్ ఔట్ చేశాడు.. తాజాగాసాయి సుదర్శ‌న్ పెవిలియ‌న్ కు చేరాడు . గుజ‌రాత్ 18 ఓవ‌ర్లు ముగిసే నాటికి నాలుగు వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది.. ప‌స్తుతం మిల్ల‌ర్ ,విజ‌య్ శంక‌ర్ క్రీజ్ లో ఉన్నారు.

కాగా, నేటి మ్యాచ్ గుజ‌రాత్ కెప్టెన్ హ‌ర్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు.. ర‌షిద్ జ‌ట్టుకు నాయ‌క‌త్వ వ‌హిస్తున్నాడు.. హర్దిన్ స్తానంలో విజయ శంకర్ జట్టులోకి వచ్చాడు.. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో రెండు మార్పులు చేశారు.. టిమ్ సౌథీ స్థానంలో ఫెర్గుసన్, మన్ దీప్ ప్లేస్ లో జగదీశన్ వచ్చాడు..గుజరాత్ జట్టు: వృద్ధిమాన్ సహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, , డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జోషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, విజ‌య్ శంక‌ర్..
కోల్ కతా నైట్ రైడర్స్ – నితీష్ రానా,ఫెర్గుసన్, జగదీశన్, రెహముల్లా గుర్భాజ్, రింకూ సింగ్, అండ్రూ రసెల్,సునీల్ నారాయణ్, శార్ధూల్ ఠాకూర్, సుషేయే శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement