Saturday, May 4, 2024

Breaking: కోహ్లీ, రోహిత్​కు రెస్ట్​.. న్యూజిలాండ్​ వైట్​బాల్​ సిరీస్​కు టీమిండియా జట్టు ఇదే..

న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం india స్క్వాడ్ జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్‌తో జరగబోయే వైట్-బాల్ సిరీస్, బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ కోసం భారత్ తమ జట్టు వివరాలను వెల్లడించింది. న్యూజిలాండ్ టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా, ఈ పర్యటనలో విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌తో జరిగే వన్డేలు, టెస్టుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement