Monday, April 29, 2024

నవంబర్​ 2 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కౌన్సెలింగ్‌.. 28 నుంచి తరగతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ నవంబర్​ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు (సోమవారం) తెలంగాణ ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. నవంబర్ 2వ తేదీ నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్​ 18, 19వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

నవంబర్‌ 22న మొదటి విడత ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం సీట్లను అభ్యర్థులకు కేటాయించనున్నారు. నవంబర్‌ 23 నుంచి 26 వరకు సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. నవంబర్‌ 28 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. తదితర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement