Wednesday, May 1, 2024

IPL : చే జారిన రికార్డ్​….

ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య విశాఖట్నంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు చేసింది.

- Advertisement -

సునీల్ నరైన్ 39 బంతుల్లో 85 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. రఘువంశీ 54 పరుగులు, రసెల్ 41 పరుగులతో రాణించారు. చివరిలో రింకూ సింగ్ కేవలం ఎనిమిది బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేకేఆర్ జట్టు 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద స్కోర్.

ఐపీఎల్ 2013లో బెంగళూరు జట్టు 263 పరుగులతో నెలకొల్పిన అత్యధిక స్కోర్ రికార్డును 11ఏళ్ల తరువాత ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది. 277 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించింది. విశాఖలో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు. ఆ జట్టు ఊపుచూస్తే కొత్త రికార్డు నమోదవడం ఖాయంగా కనిపించింది. చివరి ఓవర్లో మరో 14 పరుగులు కొడితే ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయ్యేది. కానీ, చివరి ఓవర్లో డీసీ బౌలర్ ఇషాంత్ తొలి మూడు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్లో కేవలం కేకేఆర్ బ్యాటర్లు ఎనిమిది పరుగులే రాబట్టగలిగారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేకేఆర్ జట్టు 272 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా తృటిలో ఐపీఎల్ లో రికార్డు స్కోరును కేకేఆర్ జట్టు చేజార్చుకున్నట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement