Tuesday, March 19, 2024

రాజస్తాన్ పై ఆర్సీబీ ఘనవిజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ విజయాల బాట పట్టింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (30 బంతుల్లో 50 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 150 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

మ్యాచ్‌లో తొలత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆరంభంలో ఎవిన్‌ లూయిస్‌ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో రాజస్తాన్‌ మాత్రం నామమాత్రపు స్కోరు చేసింది. లూయిస్‌ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్స్‌ పూర్తిగా విఫలమయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి 113/2తో పటిష్టంగా కనిపించిన రాజస్తాన్‌ మిగిలిన 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్ 3‌, చహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో ఫ్లే ఆఫ్స్ కి మరింత చేరువయింది.

ఇది కూడా చదవండి: మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల సమావేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement