Thursday, March 28, 2024

“మా”హితమే మా అభిమతం: ప్రకాష్ రాజ్

టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు ఆశక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే రెండు ప్యానెల్ లోని పోటీదారులు నామినేషన్ వేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఇరువురు మాటలు తూటాలు పేలుస్తున్నారు. ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక నటుడు నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణుకు పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికలపై ఓటర్లను ఉద్దేశిస్తూ.. ‘”మా” హితమే మా అభిమతం… మనస్సాక్షిగా ఓటేద్దాం.. “మా” ఆశయాలను గెలిపిద్దాం..’ మీ ఓటే.. మీ వాయిస్.. అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

ఇక అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా.. గత రెండు నెలల నుంచే ‘మా’ వేడి మొదలైయింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మొదటి నుంచి ‘మా’ ఎన్నికలపై ఉత్సహంగా వున్నా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. ఇవి ఎన్నికలు కావు. పోటీ మాత్రమేనన్న ప్రకాష్ రాజ్.. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించేది ఓటర్లే అన్నారు. అక్టోబర్ 3న తన మేనిఫేస్టో ప్రకటిస్తానన్నారు.

ఇది కూడా చదవండి: మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు: నరేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement