Thursday, May 2, 2024

ఆర్‌సీబీకి షాక్: తప్పకున్న హెడ్ కోచ్ సైమన్ కాటిచ్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లు జట్టు హెడ్ కోచ్ సైమన్ కాటిచ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్న మైక్ హెసాన్.. కోచ్ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని జట్టు ఉపాధ్యక్షుడు రాజేష్ మీనన్ వెల్లడించారు. ఇంతకాలం జట్టుకు చేసిన సేవలకుగాను కాటిచ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్-14 రెండో అర్థభాగంలో ఆర్‌సీబీ ప్రయాణం సెప్టెంబరు 20న ప్రారంభం కానుంది. ఆరోజున కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుతో అబుధాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు తలపడనుంది.

ఇది కూడా చదవండి: చైనా చేస్తున్న పని వల్ల పురుషుల్లో అంగం సైజు త‌గ్గుతోంద‌ట‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement