Thursday, April 18, 2024

రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్’ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

రాఖీ పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.’రక్షాబంధన్’ ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, సహోదరత్వానికి ఈ పండుగ నిదర్శనంలా నిలుస్తుందని అభివర్ణించారు. ఇదొక గొప్ప సందర్భమని, జీవితకాలం పాటు తమ అనుబంధం కొనసాగాలని కోరుకుంటూ అన్నదమ్ముల చేతికి మమతానురాగాలతో రక్షా బంధనాన్ని కడతారని రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. భారత ప్రజల జీవన ఔన్నత్యం ఈ పండుగ ద్వారా వెల్లడవుతుందని తెలిపారు కేసీఆర్. రక్షాబంధన్’ పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా సందడి వాతావరణం కనిపిస్తోంది. సోదర సోదరీ బంధానికి ప్రతీకలా నిలిచే ఈ పండుగ నేపథ్యంలో శనివారం నాడే రాఖీ దుకాణాలు, స్వీట్ షాపుల వద్ద రద్దీ కనిపించింది.

ఇది కూడా చదవండి: దేశానికి రాజైనా అంబర్ పేట బిడ్డనేః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగం

Advertisement

తాజా వార్తలు

Advertisement