Saturday, May 4, 2024

RCB : మీకు ఇజ్జ‌త్ ఉందా…ఆర్సీబిపై అభిమానులు ఆగ్ర‌హం

ఒకవైపు ఐపీఎల్ 2024లో రాజస్థాన్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మరోవైపు మిగతా జట్లకంటే అశేషమైన అభిమానులను సంపాదించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఈ సీజన్‌లో చాలా పేలవ ప్రదర్శన చేస్తోంది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమరూన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు గాను ఏడింటిలో ఓడిపోయింది.

- Advertisement -

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్‌లకు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, మరికొందరు ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన పని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే..ఆర్సీబి తన తదుపరి మ్యాచ్‌ని నేడు హైదరాబాద్‌తో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకుంది బెంగళూరు టీమ్. కాగా విరాట్ కోహ్లీ One8 Commune పేరుతో రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ లో కూడా దీనికి బ్రాంచ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లను తన రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు కోహ్లీ.. అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, సుయాష్ ప్రభుదేశాయ్, విశాక్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వన్ 8 కమ్యూన్‌లో పార్టీ చేసుకున్నారు. అయితే దీనిపై ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్లందరినీ అభిమానులు ట్రోల్ చేశారు గెలువ‌లేరు గానీ పార్టీలు మాత్రం చేసుకుంటారా అంటూ చెల‌రేగిపోతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement