Monday, May 6, 2024

IPL | కీలక మ్యాచ్​లో రాజస్థాన్​ గెలుపు.. పాయింట్స్​ టేబుల్​లో 5వ స్థానం

పంజాబ్​తో జరిగిన కీలక మ్యాచ్​లో  రాజస్థాన్​ సునాయసంగా గెలిచింది. అయితే.. మ్యాచ్​ చివరిదాకా ఉత్కంఠగా సాగింది. ఒక దశలో పంజాబ్​ గెలుస్తుందేమో అన్నట్టుగా వ్యూయర్స్​ టెన్షన్​కి గురయ్యారు. ఈ మ్యాచ్​లో యశస్వి జైశ్వాల్​ (50), పడిక్కల్​ (51), హోట్మేయర్​ (46), పరాగ్​ (20) పరుగులతో ఆకట్టుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్​ చేసిన పంజాబ్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. కాగా, రాజస్థాన్​ 188 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగింది.

ఇక.. ఈ మ్యాచ్ గెలుపుతో రాజస్థాన్​ రాజస్థాన్​ పాయింట్స్ టేబుల్​లో 5వ స్థానానికి చేరింది. అయితే నెట్​ రన్​రేట్​ రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు కంటే తక్కువగా ఉండడంతో ప్లే ఆఫ్స్​కి క్వాలిఫై కావడం కష్టమే అయ్యేట్టు ఉంది. కాగా, తరువాత గుజరాత్​ టైటాన్స్​తో జరిగే మ్యాచ్​లో బెంగళూరు జట్టు తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement