Sunday, May 19, 2024

ఏపీ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ రెడీ.. ఎల్లుండి ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

ఏపీలోని గుంటూరు జిల్లాలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆటోనగర్‌ వద్ద ఏఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వెనుక భాగంలో అయిదంతస్తులతో కూడిన నూతన భవనంలో కార్యాలయం కొలువుదీరనుంది. పార్టీ సమావేశాల నిర్వహణకు రెండు ఫ్లోర్లు కేటాయించారు. అతిథులు కూర్చొనే విధంగా పెద్దహాలు ఏర్పాటు చేశారు. ఇక, ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఉంటుంది. ఈ నూతన కార్యాలయాన్ని ఈ నెల 21న (ఆదివారం) ఉదయం 11.35 నిమిషాలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement