Friday, April 26, 2024

ఎంఎస్‌ ధోని నుంచి మెసేజ్‌ వచ్చింది: సంజు

ఐపీఎల్ 2021 సీజన్ కి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికైన సంజు శాంసన్ కి ధోని, కోహ్లీ, రోహిత్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినందుకు కోహ్లి, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోని నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయంటూ సంజు శాంసన్ తెలిపాడు. కంగ్రాట్స్‌ శాంసన్‌.. కొత్త బాధ్యతతో ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్నావు.. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ముగ్గురు అభినందిస్తూ పర్సనల్‌గా సందేశాలు పంపారని తెలిపాడు. కాగా గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీలో రాజస్తాన్‌ రాయల్స్‌ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement