Wednesday, May 1, 2024

పాకిస్థాన్‌ క్లీన్ స్వీప్‌.. విండీస్‌పై 3.0తేడాతో టీ20 సిరీస్‌ కైవసం

వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్‌ 3-0తేడాతో గెలుచుకుంది. పర్యాటక విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన పాక్‌ ఈ ఏడాదిలో 20వ టీ20 విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20ను పాక్‌ 7వికెట్ల తేడాతో గెలుచుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన రిజాన్‌..ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు.

కరాచీ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌ టాస్‌ గెలుచుకుని బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20ఓవర్లలో వెస్టిండీస్‌ 3వికెట్లకు 207పరుగులు భారీస్కోరు సాధించింది. కెప్టెన్‌ పూరన్‌ (64) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం పాకిస్థాన్‌ 208పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌ ఓపెనింగ్‌ జోడీ రిజాన్‌ 45బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లతో 87పరుగులు, కెప్టెన్‌ బాబర్‌ 53బంతుల్లో 9ఫోర్లు, 2సిక్స్‌లతో 79పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement