Thursday, April 18, 2024

దక్షిణాఫ్రికా చేరుకున్న కోహ్లీసేన

జోహన్స్‌బర్గ్‌: కోహ్లీ సారథ్యంలోని టీమిండియా గురువారం దక్షిణాఫ్రికా చేరుకుంది. చార్టర్డ్‌ విమానంలో ముంబై నుంచి బయలుదేరిన 18మంది సభ్యుల టీమిండియా జోహన్స్‌బర్గ్‌ చేరుకుంది. దక్షిణాఫ్రికాలో భారతజట్టు క్వారంటైన్‌లో గడపనుంది.

సౌతాఫ్రికా చేరుకున్న జట్టులో హెడ్‌ కోచ్‌ ద్రావిడ్‌తోపాటు ఇత కోచింగ్‌ సిబ్బంది ఉన్నారు. టీమిండియా దక్షిణాఫ్రికా చేరుకున్న ఫొటోలను బీసీసీఐ షేర్‌ చేసింది. కాగా ఈనెల 26నుంచి కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement