Monday, May 6, 2024

India vs England : ఆకాష్ దీప్ పై వేటు త‌ప్ప‌దా..

భారత్ వర్సెస్ ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ తుది అంకాని చేరింది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌తో ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరపడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఆఖరి పోరులోనూ విజయం సాధించాలని భావిస్తోంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలంగా ఉంచుకోవాలనుకుంటోంది.

- Advertisement -

మరోవైపు ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. దాంతో ధర్మశాల టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకోని ప్రాక్టీస్ ప్రారంభించాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మశాల ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో అక్కడి వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది.

ర్యాంక్ టర్నర్ పిచ్ రెడీ..
అంతేకాకుండా అక్కడి పిచ్ పేస్‌కు అనుకూలిస్తోంది. బంతి స్వింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతో ఇరు జట్లు ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగుతాయని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఆఖరి టెస్ట్‌కు కూడా ర్యాంక్ టర్నర్ పిచ్ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పేస్ కంటే స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించే పిచ్ సిద్దం చేస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అదే జరిగితే టీమిండియా ఎక్స్‌ట్రా పేసర్‌కు బదులు స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. నాలుగో టెస్ట్‌కు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడంతో యువ పేసర్ ఆకాశ్ దీప్‌పై వేటు పడే అవకాశం ఉంది. రాంచీ టెస్ట్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆకాశ్ దీప్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

కుల్దీప్ కోసం అత‌డిపై వేటు
కానీ రెండో మ్యాచ్‌లోనే చోటు కోల్పోయే అనివార్య పరిస్థితి అతని ఎదురైంది. కుల్దీప్ యాదవ్ కోసం ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పేస్ పిచ్‌ను రెడీ చేస్తే మాత్రం మూడో పేసర్‌గా ఆకాశ్‌దీప్ బరిలోకి దిగుతాడు. ముకేష్ కుమార్‌తో పోటీ ఉన్నా.. ఈ ఆర్‌సీబీ బౌలర్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తోంది.

రోహితే కెప్టెన్ …
రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం లేదని విషయం స్పష్టమైంది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా రజత్ పటీదార్‌పై వేటు వేస్తారా? లేక మరో అవకాశం ఇస్తారా? అనేది చూడాలి. ఒకవేళ వేటు వేస్తే మాత్రం దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేస్తాడు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు.
భారత తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్/రజత్ పటీదార్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్/కుల్దీప్ యాదవ్

Advertisement

తాజా వార్తలు

Advertisement