Saturday, April 27, 2024

మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు బెదిరింపులు..

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కివీస్ మహిళా క్రికెట్ జట్టుకు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బెదిరింపుల ఈ-మెయిల్ ఈసీబీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల పాకిస్థాన్‌లో టూర్ చేస్తున్న కివీస్ పురుషుల జ‌ట్టు కూడా భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కివీస్ మ‌హిళ‌ల జ‌ట్టు మంగ‌ళ‌వారం లీసెస్ట‌ర్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉన్న‌ది. న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టును వైట్ ఫెర్న్స్‌గా పిలుస్తుంటారు. పాకిస్థాన్‌తో జ‌ర‌గాల్సిన టూర్‌ను కూడా ఇంగ్లండ్ మెన్స్ జ‌ట్టు ర‌ద్దు చేసుకున్న నేప‌థ్యంలో తాజా బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవల పాక్ టూర్ ర‌ద్దు చేసుకున్నారు కివీస్ ఆట‌గాళ్లు. స్టేడియం బ‌య‌ట త‌మ ఆట‌గాళ్ల‌పై దాడి జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కివీస్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌తో పేర్కొన్న‌ట్లు స‌మాచారం ఉంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌ళ్లీ వేదిక అవ్వాల‌నుకుంటున్న పాకిస్థాన్‌కు తాజా ప‌రిణామాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ త‌ప్పుకోవ‌డంతో పాక్‌కు భారీ న‌ష్టం వ‌చ్చింది.

ఇది కూడా చదవండి: మూడేళ్ల చిన్నారిని తాడుతో కొట్టిన కన్న తండ్రి..

Advertisement

తాజా వార్తలు

Advertisement