Sunday, April 28, 2024

IPL | గుజరాత్​పై గెలిచిన ముంబయి.. ప్లే ఆఫ్​ బెర్త్​ కన్​ఫాం

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇవ్వాల (శుక్రవారం) రాత్రి గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే.. ఇందులో సూర్యకుమార్​ యాదవ్​ 103* పరుగులతో రెచ్చిపోయి ఆడడంతో  ఈ స్కోరు సాధ్యమయ్యింది. కాగా, 219 పరుగుల టార్గెట్​తో చేజింగ్​కి దిని గుజరాత్​ జట్టు ఆదిలోనే టఫ టఫా వికెట్లను పడేసుకుంది. దీంతో 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

కాగా, 9వ వికెట్​ భాగస్వామ్యంలో రషీద్​ఖాన్​, జోసఫ్​ ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. పరువు పోతుందనుకున్న గుజరాత్​కు సిక్స్​లు, ఫోర్లతో రషీద్​(79) పరుగులతో రాణించి కాపాడాడు. నిర్ణీత ఓవర్లలో గుజరాత్​ 191 పరుగులు మాత్రమే చేసి, 27 తేడాతో ముంబయిపై ఓటమిచెందింది. ఈ మ్యాచ్​ గెలవడంతో ముంబయి ప్లే ఆఫ్స్​ బెర్త్​ కన్​ఫాం చేసుకుని పాయింట్స్​ పట్టికలో సుస్థిర స్థానం సంపాదించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement