Monday, April 29, 2024

సచిన్ ను కలిసిన మీరాబాయ్ ఛాను..

టోక్యో ఒలింపిక్స్ మన దేశానికి తొలి మెడల్ సాధించిన మీరాబాయ్ ఛాను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ని కలిశారు. సచిన్ ను కలిసిన అనంతరం మీరాబాయ్ ఛాను ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. లవ్లీ మీటింగ్.. ఈ రోజు ఉదయం ఆయన్ను కలిశాను. అతని తెలివి, మోటివేషన్ ఎప్పుడూ నాతో ఉంటాయి. నిజంగా ఇన్‌స్పైర్ అయ్యా’ అని ట్వీట్టర్ లో పోస్టు పెట్టింది చాను. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్ చేసిన కొద్ది గంటల తర్వాత సచిన్ కూడా రిప్లై ఇచ్చారు. ‘ఈ రోజు ఉదయం ఆమెను కలిసినందుకు నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యా. మణిపూర్ నుంచి టోక్యో వరకూ చేరిన ప్రయాణం అద్భుతం. రాబోయే కాలంలో మరింత ముందుకెళ్లాలని ఆశిస్తున్నా. ఇలాగే కష్టపడు’ అని సచిన్ ట్వీట్ చేశారు.

ఒలింపిక్స్ క్రీడలు మొదలయిన తొలిరోజే యిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది మీరాబాయి చాను. అప్పటి నుంచి మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది. కరణం మళ్లీశ్వరీ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఫీట్ సాధించి రెండో మహిళగా నిలిచారు. 2020ఒలింపిక్స్ 49కేజీల విభాగంలో మీరాబాయి ఈ ఫీట్ సాధించగా.. 2000 సిడ్నీ ఒలింపిక్స్ కాంస్యం గెలిచారు మల్లీశ్వరి. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఇండియాకు అదే తొలి పతకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement