Sunday, April 28, 2024

IPL rules Break : రిషబ్ పంత్‌కు మ‌రోసారి జరిమానా

ఈ సీజ‌న్ లో రిష‌బ్ పంత్ జ‌ట్టు మ‌రోసారి ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించింది. ఐపీఎల్ 2024 లో భాగంగా బుధవారం ఢిల్లీ, కలకత్తా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది. కాగా విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఢిల్లీ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినందుకు బీసీసీఐ జరిమానా విధించింది. ఓ వైపు కలకత్తా బ్యాటర్లు తమ బౌలర్లను ఊచకోత కొయడంతో ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలర్లతో మంతనాలు జరుపుతూ బౌలింగ్ చేయించారు.

దీంతో.. స్లో ఓవర్ రేట్ మెయింటెయిన్ అయింది. ఈ కారణంగా పంత్ కు తన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఇదిలా ఉంటే.. “మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టుకు ఇది రెండవ ఉల్లంఘన. దీంతో పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రూ.6 లక్షలు, వారి సంబంధిత మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానా విధించబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement