Thursday, May 9, 2024

IPL 2024 | సీఎస్‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌ను మార్చి 23న ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల‌లో ఒక‌టైన‌ చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ కంపెనీ స్పాన్సర్‌షిప్ హక్కులను పొందింది. ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది సీఎస్‌కే. తమ జట్టు బ్రాండ్ అంబాసిడర్‌‌గా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను ఎంపిక చేసింది. సీఎస్‌కే కొత్త స్పాన్స‌ర్ ఎతిహ‌ద్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న‌ క‌త్రినా.. ధోనీ సేన‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement