Thursday, May 2, 2024

పాకిస్తాన్ పై ఇండియా గెలుపుతో లండన్ లో సంబరాలు

టి20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ గెలుపొందడంతో లండన్ లో భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం భారత్ గెలుపొందడంతో త్రివర్ణ పథకాన్ని చేతబూని జై భారత్, జై కోహ్లీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లండన్ వీధుల్లో మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయులు మాట్లాడుతూ భారత్ గెలుపులో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించి మరోసారి కింగ్ అని నిరూపించుకున్నాడన్నారు. టి20 విజేత భారత్ అని కేరింతలు కొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement